మళ్లీ ఘాటెక్కిన ఒంగోలు రాజకీయం
ప్రకాశం: ఒంగోలులో రాజకీయం మళ్లీ ఘాటెక్కింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. డ్వాక్రా అవినీతి జరిగిందని, అది ఎవరు చేశారో ఒంగోలు ప్రజలకు తెలుసని బాలినేని పేర్కొన్నారు. ఇప్పటికే దీనిపై ఫిర్యాదు చేశామని, ఆయన కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నారని, కలెక్టర్తో స్పెషల్ ఎంక్వైరీ వేపించుకోవాలని దామచర్ల అన్నారు.