'కార్మికురాలు భవానికి న్యాయం చేయాలి'

NTR: మైలవరంలో కార్మికురాలు బిజిలి భవానిపై దాడిని ఖండిస్తూ కటారు ఉమామహేశ్వ రావును అరెస్టు చేయాలని విస్సన్నపేట సీఐటీయూ, పంచాయతీ కార్మికులు ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో నిరసన వ్యక్తం చేసారు. సీఐటీయూ అధ్యక్షులు వెంకటేశ్వరరావు ప్రసంగించారు. మైలవరంలో కార్మికురాలుపై కారుతో ఢీకొట్టడమే కాకుండా ఆమెపై దాడి చేయడం దారుణమన్నారు.