రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
VZM: అనంతగిరి మండలం కొత్తూరు కాశీపట్నం మధ్య శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ కోటకు చెందిన రఫీ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తన బైక్ పై ఎస్ కోట వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో గాయపడిన అతడిని 108 వాహనం లో ఎస్కోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విశాఖకు తరలించగా మార్గమధ్యంలో మృతి చెందాడు.