'OP సింధూర్ విజయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది'
OP సింధూర్ విజయాన్ని కాంగ్రెస్- RJD జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. పాక్లో పేలుళ్లు జరిగితే, కాంగ్రెస్ రాజకుటుంబం నిద్ర కోల్పోయిందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ షాక్ నుంచి పాక్తో పాటు కాంగ్రెస్ కూడా కోలుకోలేదని పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రతిజ్ఞతో NDA ముందుకుసాగుతోందని.. కానీ కాంగ్రెస్ కూటమి ఘర్షణ పడుతుందని తెలిపారు.