VIDEO: నాన్ లోకల్ కాంగ్రెస్ నేతలపై ఈసీ ఆగ్రహం
HYD: జూబ్లీహిల్స్లో పోలింగ్ బూత్ల వద్ద తిరుగుతున్న నాన్ లోకల్ కాంగ్రెస్ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్ బూత్కు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారని ఈసీ పేర్కొంది. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్లపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.