అక్రమ రేషన్ బియ్యం సీజ్
MBNR: మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 127 బ్యాగుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సోమవారం సీజ్ చేశారు. పక్కా సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.