VIDEO: ఫ్రీ బస్సు అమలుపై మహిళ ఆవేదన
NGKL: మన్ననూర్ బస్టాండ్ సమీపంలో శ్రీశైలం వెళ్లాల్సిన ఓ మహిళ ఆందోళన చేపట్టింది. బస్టాండ్లో ఆపకుండా బస్సులు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. బస్సులను అడ్డుకుని డ్రైవర్, కండక్టర్తో వాగ్వాదానికి దిగింది. ఉచిత బస్సుల పథకం వల్ల ప్రయాణం కష్టమైందని, దయచేసి ఈ పథకాన్ని రద్దు చేయాలని ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కోరింది.