విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం ఎంతంటే?

కోనసీమ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మంగళవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 1,11,836 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 72 మంది స్వామివారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. అలాగే, 5 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారన్నారు.