పెండ్లిమర్రికి చేరుకున్న ముఖ్యమంత్రి
KDP: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలానికి చేరుకున్నారు. 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల' కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఘన స్వాగతం పలికారు.