గుంతకల్లు పట్టణ ప్రజలకు శుభవార్త.!

గుంతకల్లు పట్టణ ప్రజలకు శుభవార్త.!

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో ఆస్తిపన్ను బకాయిల చెల్లింపుపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మంగళవారం మీడియాకు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నును ఒకే విడతలో చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.