శోభాయాత్రకు రావాలని మాజీ మంత్రికి ఆహ్వానం

శోభాయాత్రకు రావాలని మాజీ మంత్రికి ఆహ్వానం

RR: ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావును ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శోభాయాత్రకు మాజీ మంత్రిని ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. శోభాయాత్రకు భక్తులు భారీ సంఖ్యలో హాజరుకావాలన్నారు.