30 ఏళ్ల క్రితం కేసు.. సీబీఐ ఆఫీసుపై దాడి

30 ఏళ్ల క్రితం కేసు.. సీబీఐ ఆఫీసుపై దాడి

విల్లు, బాణాలతో సీబీఐ కార్యాలయంపై దాడి చేసిన ఘటన UP లక్నోలో జరిగింది. 30 ఏళ్ల క్రితం తనను అవినీతి కేసులో ఇరికించారంటూ బిహార్ రాష్ట్రానికి చెందిన దినేశ్ తాజాగా ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ASI గాయపడినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టడం వల్ల రైల్వే ఉద్యోగాన్ని కోల్పోయానని అందుకే దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు.