పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈవో
KMR: జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు DEO రాజు తెలిపారు. జిల్లాలో 13,154మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. మొత్తం 65 పరీక్ష కేంద్రాలు, చీఫ్ సూపరింటెండెంట్లు 65, డిపార్ట్మెంటల్ అధికారులు 65, అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు 7, ఇన్విజిలేటర్లు 739 మందిని నియమించామన్నారు.హెల్ప్ లైన్ నంబర్ 9959670118ను కేటాయించామన్నారు.