పవన్ కళ్యాణ్పై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు
సత్యసాయి: కదిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అసత్య, అవమానకర వ్యాఖ్యలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కదిరి డీఎస్పీ కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు. ఇలాంటి చర్యలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.