సైకిల్‌పై చార్‌ధామ్ యాత్ర

సైకిల్‌పై చార్‌ధామ్ యాత్ర

KKD: సామర్లకోట పట్టణానికి చెందిన యువత సైకిల్‌పై చార్‌ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. కే సాయి నాయుడు, బి శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులు సైకిళ్లపై గురువారం చార్‌ధామ్ యాత్రకు బయలుదేరారు. యాత్రను డిసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు. ముందుగా ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి యాత్రకు బయలుదేరి వెళ్లారు.