పులికోన వద్ద క్షుద్ర పూజల కలకలం

పులికోన వద్ద క్షుద్ర పూజల కలకలం

CTR: చౌడేపల్లి మండలం ఆమెనిగుంట గ్రామ సమీపంలో శుక్రవారం పులికోన వద్ద క్షుద్ర పూజల కలకలం రేగింది. నేలపై రక్తం, నిమ్మకాయలు, రకరకాల పూజ సామాగ్రితో ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.