రేపు జరుగుమల్లికి మంత్రి రాక..!

రేపు జరుగుమల్లికి మంత్రి రాక..!

ప్రకాశం: జరుగుమల్లి మండలం దావగూడూరు గ్రామంలో రేపు ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమానికి కొండేపి ఎమ్మెల్యే, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి రానున్నారని జరుగుమల్లి మండల టీడీపీ అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది, మండల నాయకులు, ప్రభుత్వ అధికారులు, గ్రామస్థులు పాల్గొనాలని తెలిపారు.