మాజీ సర్పంచ్ చిత్రపటానికి నివాళులర్పించిన వైసీపీ సమన్వయకర్త
CTR: వెంకటగిరి రూరల్ మండలం చిన్నన్నపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, మాజీ సర్పంచ్ దవల రామయ్య ఇటీవల మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి రామయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.