శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే బండారు శ్రావణి

ATP: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేద పండితులు ప్రసాదాలు అందజేశారు. అనంతరం తిరుపతిలో రెండో రోజు జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో ఆమె పాల్గొన్నారు.