నరసాపురం ఎమ్మెల్యేని కలిసిన డీఎస్పీ

నరసాపురం ఎమ్మెల్యేని కలిసిన డీఎస్పీ

WG: నరసాపురంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ను డీఎస్పీ ఎం. సుధాకర్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఎమ్మెల్యేకు పూలమొక్కను అందజేశారు. అనంతరం నియోజకవర్గంలోని శాంతిభద్రతల పరిస్థితులపై వారు చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా విధులు నిర్వహించాలని సూచించారు.