మునగపాకలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం
AKP: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం మునగపాకలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలమంచిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వం మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నడపాలన్నారు.