ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఆదివారం నాడు పొద్దుటూరు పట్టణానికి చెందిన బొమ్మిరెడ్డి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం 50,116 రూపాయల విరాళాన్ని వారు ఆలయ అధికారులకు అందజేశారు. ధనలక్ష్మి కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.