జాతరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు

జాతరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు

అనకాపల్లి నూకాంబికా అమ్మవారి జాతరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. మంగళవారం ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. నెలరోజుల పాటు జరిగే జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. భక్తులు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు తాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు.