'మా జీతాలు వెయ్యండి సారూ'
KRNL: ఆదోని మండలం మండగిరిలో స్వచ్ఛ భారత్ కార్మికులు ఐదు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 9 మంది కార్మికులు తమ ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని వాపోతున్నారు. అధికారులు మాత్రం నిధులు విడుదల చేశామని చెబుతుండటంతో గందరగోళం నెలకొంది. బ్యాంకింగ్ సమస్య లేక అధికారుల నిర్లక్ష్యమా అన్నది తేలాల్సి ఉంది. బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.