మాక్ అసెంబ్లీ విజేతలకు బహుమతులు అందజేత
E.G: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తూ.గో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం జరిగిందని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ప్రతి మండలం నుంచి ఒక విద్యార్థి చొప్పున 21 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. బుధవారం రాజమండ్రిలో విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.