IPL బెట్టింగ్లపై ఎస్సై హెచ్చరికలు
బాపట్ల జిల్లా చెరుకుపల్లిలో IPL బెట్టింగ్లపై ఎస్సై తిరుపతిరావు హెచ్చరికలు జారీ చేశారు. బెట్టింగ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. బెట్టింగ్ ఆడేవారు, నిర్వహించే వారిపై ఏపీ గేమింగ్ చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలుపై చర్యలు తప్పవని చెప్పుకొచ్చారు.