పాక్‌పై జైశంకర్ మండిపాటు

పాక్‌పై జైశంకర్ మండిపాటు

పాక్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి జైశంకర్ మండిపడ్డారు. పట్టపగలే ఉగ్రవాదుల కార్యకలాపాలకు ఆ దేశం సహకారం అందిస్తుందని ధ్వజమెత్తారు. దాయాది దేశంలో ఉగ్రవాదులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఆ దేశం సరిహద్దు ఉగ్రవాదంలో పీకల్లోతులో కూరుకుపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.