ధాన్యం విక్రయంలో ఆలస్యం చేయొద్దు: జేసీ
బాపట్ల జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలని జాయింట్ కలెక్టర్ భావన సూచించారు. ఇప్పటికే 1.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. ఈ నెల 28తో కొనుగోలు కేంద్రాలు మూసివేయనున్నందున, రైతులు గడువు ముందే విక్రయాలు పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.