రాజీవ్ యువ వికాసం రుణాల కోసం ఎదురుచూపులు
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు రాజీవ్ యువ వికాసం పేరిట ధరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉండడంతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చనే ఉద్దేశంతో 1.44 లక్షల మంది దరఖాస్తు ఏడుకున్నారు. పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి.