అమ్మవారికి 50 వేల గాజుల అలంకరణ

W.G: మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా 50 వేల గాజులతో అలంకరణ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు, దాతల సహకారంతో చేసిన ఈ అలంకరణలోని గాజులను ఆదివారం భక్తులకు పంపిణీ చేయనున్నారు.