నేడు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత

నేడు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత

MBNR: జిల్లాలో రోడ్ విస్తరణ, వాల్వ్ రిపేర్ కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 24 గంటలు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మహబూబ్‌నగర్ మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ అధికారి డీ.శ్రీనివాస్ తెలిపారు. MBNR, NRPT జిల్లాలోని 258 గ్రామాలకు, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర పురపాలకలకు పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.