డిండి అంగడి బజార్ లో హెచ్చరిక బోర్డు

NLG: డిండి అంగడి బజార్లో ఉన్న ఇంజన్బావికి సంబంధించిన గ్రామకంఠం భూమిలో అధికారులు హెచ్చరిక బోర్డును ఇవాళ ఏర్పాటు చేశారు. సంవత్సరాల తరబడి పట్టణ వాసులకు మంచినీటిని అందించిన ఇంజన్బావిని కొందరు ఆక్రమిండానికి చూస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన DLPO శంకర్ నాయక్ ఇంజన్బావికి హద్దులు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించారు.