VIDEO: తండావాసులతో కలిసి ఎమ్మెల్యే డ్యాన్స్
RR: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం కర్ణంకుంట తండాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా తండావాసులతో కలిసి ఎమ్మెల్యే డ్యాన్స్ వేశారు.