వీరమ్మ కాలనీలో ఆరోగ్య శిబిరం

వీరమ్మ కాలనీలో ఆరోగ్య శిబిరం

PLD: కొండమోడు వీరమ్మ కాలనీలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆర్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే తగినంత నీరు, మజ్జిగ, రాగి జావ తీసుకోవాలని, మధ్యాహ్నం వేళ బయట తిరగవద్దని సూచించారు. అనంతరం గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుష్ మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు, పాల్గొన్నారు.