బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం.. ఎమ్మెల్యేకు ఘన సన్మానం
MDCL: మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగ్లో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళన సభ ఘనంగా నిర్వహించారు. నేరేడ్మెట్లో బ్రాహ్మణ భవనానికి ఒక ఎకరం భూమి కేటాయింపునకు గాను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని బ్రాహ్మణ సంఘాలు ఘనంగా సన్మానించాయి. బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, బ్రాహ్మణ సంఘాల నాయకులు పాల్గొన్నారు.