'అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి'

'అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి'

NLG: గ్రామంలోని సమస్యలను పరిష్కరించడమే కాకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా పనిచేస్తానని చిట్యాల మండలం తాళ్ల వెల్లంల సర్పంచ్‌గా గెలిచిన జోగు సురేష్ అన్నారు. తన గెలుపుకు సహకరించిన గ్రామస్తులకు, కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జీపీ ఆవరణలో పాలకవర్గానికి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.