ఏపీలో నెంబర్ వన్ స్థానంలో ఉరుకుంద దేవాలయం
KRNL: ఏపీ ప్రభుత్వం నిర్వహించిన పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ సర్వేలో కౌతాళం (మం) ఉరుకుందలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. దర్శనం, ప్రసాదం, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం అంశాల్లో మెరుగైన సేవలతో వరుసగా మూడోసారి టాప్లో నిలిచింది. భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని డిప్యూటీ కమిషనర్ కే.వాణి తెలిపారు.