తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే

MBNR: మహబూబ్‌నగర్ పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన పట్టణంలోని పలు డివిజన్లలో 4 ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా UIDF పథకం కింద పట్టణంలో 14 ట్యాంకులను నిర్మిస్తున్నట్లు తెలిపారు.