మోసురులో పర్యటించిన అధికారులు
PPM: పాచిపెంట మండలం మోసురు గ్రామంలో నూతనంగా సీసీ రోడ్లు, వీధి కాలువలు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎంపీడీవో బీవీజే పాత్రో తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దార్ డి.రవితో కలిసి పర్యటించారు. ఏ ఏ కాలనీలో సీసీ రోడ్లు, వీధి కాలువలు అవసరం అనేది గుర్తించామని, గ్రామంలో తాగునీరు సమస్య లేకుండా చూస్తామని వారు పేర్కొన్నారు.