ఎన్ఎస్ఎస్ క్యాంప్పై అవగాహన
NLR: అల్లూరు మండలంలోని యర్రపగుంట గ్రామంలో శనివారం ఎన్ఎస్ఎస్ క్యాంప్పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత బీద గిరిధర్ విచ్చేశారు. విద్యార్థులు ఏడు రోజులు పాటు గ్రామములో ఉంటూ పరిసరాల పరిశుభ్రతపై స్థానికులకు అవగాహన కల్పిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.