ప్రజా సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే

NLR: బుచ్చి పట్టణంలోని 5,6,7, వార్డుల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు, ఇళ్ల స్థలాలు వంటి పలు సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.