ఈనెల 27న వాహనాల బహిరంగ వేలం: సీఐ
NDL: ఈ నెల 27న ఉదయం 10 గంటలకు వివిధ కేసులలో సీజ్ అయిన వాహనాలకు వేలం నిర్వహిస్తున్నట్లు నందికొట్కూరు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. వేలం పాటలో పాల్గొనే ఔత్సాహికులు ప్రభుత్వ నిబంధనల మేరకు ధరావతు చెల్లించి వేలం పాటలో పాల్గొనవచ్చు అని పేర్కొన్నారు. వివిధ కేసులలో సీజ్ అయిన 7 వాహనాలకు బహిరంగ వేలం ఉంటుందన్నారు.