కొండూరులో సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష

కొండూరులో సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష

పల్నాడు: అచ్చంపేట మండలం కొండూరు గ్రామంలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ‘ప్రజల వద్దకు ప్రవీణ్’ పర్యటనను 67వ రోజు కొనసాగించారు. గ్రామ సమస్యలను స్వయంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఆన్లైన్ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. కూటమి ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు.