క్రీడాకారులకు అందించే మెడల్స్ను ఆవిష్కరించిన ఏయూ
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటోంది. ఇందులో భాగంగా క్రీడా విభాగం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనుంది. ఈ క్రీడల్లో విజయం సాధించే క్రీడాకారులకు అందించే మెడల్స్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం పాలకమండలి సమావేశ మందిరంలో ఏయు అధికారులతో కలిసి ఉపకులపతి ఆచార్య జీ.పీ రాజశేఖర్ ఆవిష్కరించారు.