నేడు శిర్డీ సాయి ఆలయ వార్షికోత్సవం

నేడు శిర్డీ సాయి ఆలయ వార్షికోత్సవం

SKLM: ఇచ్ఛాపురం మండల ఈదుపురంలో శిర్డీ సాయి ఆలయ 15వ వార్షికోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఉలాసి గోపాలరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఇవాళ ప్రత్యేక హారతి, నారాయణ సేవ తదితర ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.