జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్
ATP: అనంతపురం జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన 15వ స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన బంగారు పతకాలు, పట్టాలను అందజేశారు. విద్యా రంగంలో జేఎన్టీయూ అందిస్తున్న సేవలను కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.