పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన మెదక్ RDO.!
MDK: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ అల్లాదుర్గం మండలంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని మెదక్ ఆర్డీవో రమాదేవి పరిశీలించారు. పోలింగ్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తీరును పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.