వైద్య సేవలపై తనిఖీలు.. ప్రజల సంతృప్తే లక్ష్యం

వైద్య సేవలపై తనిఖీలు.. ప్రజల సంతృప్తే లక్ష్యం

PPM: ప్రజలు సంతృప్తి చెందే విధంగా వైద్య సేవలు అందించాలని జిల్లా ఎన్‌సీడీ అధికారి డా. టి. జగన్ మోహన్ తెలిపారు. ఈ మేరకు బాగువలస, మెంటాడవీధి ఆరోగ్య కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగుల వివరాల నమోదు, ల్యాబ్ నివేదికలు, పరికరాల పనితీరును పరిశీలించారు. పిహెచ్సీల్లో ప్రసవ సేవలు మెరుగుపర్చాలని, మందులు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు.