జిల్లాకు మళ్లీ వస్తా.. అవసరమైన నిధులు కేటాయిస్తా: CM

జిల్లాకు మళ్లీ వస్తా.. అవసరమైన నిధులు కేటాయిస్తా: CM

ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు.. రజాకార్లను ఎదిరించిన ఘనత జిల్లా ప్రజలకే దక్కుతుందని CM రేవంత్ రెడ్డి అన్నారు. బజార్హత్నూర్‌లోని పిప్పిరిలో సోమవారం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఉమ్మడి జిల్లాకు మళ్లీ వస్తా.. అవసరమైన నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం జూన్ 2లోగానే శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.