వనదుర్గమ్మకు సౌమ్యవాసరే ప్రత్యేక పూజలు
MDK: పాపన్నపేట మండలం నాగసాన్పల్లి శివారులో వెలసిన శ్రీ ఏడుపాయల దేవాలయంలో బుధవారం అమ్మవారికి సౌమ్య వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం శుక్లపక్షం సప్తమి పురస్కరించుకొని, పంచామృతాలు మంజీరా నది పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి, నైవేద్యం సమర్పించారు.